రేపు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (15:54 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తనయుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. ఇందుకంసో ఆయన విజయవాడ తాడేపల్లి నుంచి మంగళవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి 11 గంటలకు దర్శికి చేరుకుంటారు. అక్కడ రిసెప్షన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. నూతన దంపతులను ఆశీర్వదించిన తర్వాత ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం పర్యటనకు అనుగుణంగా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, ఇటీవల వచ్చిన మాండస్ తుఫాను కారణంగా రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ తుఫాను ప్రభావంతో విస్తారంగా కురిసిన భారీ వర్షాల వల్ల చేతికొచ్చిన పంట నీటమునిగింది. ఈ రైతులను ఒక్కరంటే ఒక్కరు వైకాపా మంత్రి లేదా అధికార యంత్రాంగం లేదా సీఎం పరామర్శించలేదని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. కానీ, తమ పార్టీ నేతల వివాహాది శుభకార్యాలకు మాత్రం సీఎం వచ్చి వెళ్లడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments