Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తిరువూరులో జగనన్న విద్యా దీవెన నిధులు పంపిణీ

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (08:39 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోమారు నిధులు అర్హులైన లబ్దిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులు బట్వాడా చేస్తారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని నిధులను కంప్యూటర్ బటన్ నొక్కి రిలీజ్ చేశారు. 
 
జగనన్న విద్యా దీవెన పథకం కింద గత యేడాది అక్టోబరు - డిసెంబరు నెలల త్రైమాసికానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేయనున్నారు. ఆదివారం తిరువూరు కేంద్రంగా జరిగే బహిరంగ సభలో మొత్తం 9.86 లక్షల మంది విద్యార్థులు ఖాతాల్లోకి రూ.698.68 కోట్ల నగదును ఆయన జమ చేస్తారు. 
 
ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత క్రమం తప్పకుండా నిధులను జమ చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ప్రతి త్రైమాసికం చివరలో సాయాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకం కింద ఇప్పటివరకు మొత్తం రూ.13,311 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments