Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ సర్కారు సీరియస్.. రంగంలోని ఇంటెలిజెన్స్

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (13:55 IST)
సొంత పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (వైకాపా) చేసిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగాన్ని రంగంలోకి దించింది. ఇందుకోసం ఆడియో రికార్డుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అలాగే, శ్రీధర్ రెడ్డితో ఫోనులో మాట్లాడిన రామశివారెడ్డిని కూడా విచారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
బుధవారం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులతో సమావేశమై కోటంరెడ్డి చేసిన ఆరోపణలపై సుధీర్ఘంగా చర్చించారు. 
 
ఆ తర్వాత ఇంటెలిజెన్స్ విభాగాన్ని రంగంలోకి దించి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా ఇప్పటికే రామశివారెడ్డి కాల్ డేటాను సేకరించినట్టు సమాచరాం. అయితే, సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యవహారం ఎంతదూరం వెళుతుందో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments