Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ సర్కారు సీరియస్.. రంగంలోని ఇంటెలిజెన్స్

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (13:55 IST)
సొంత పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (వైకాపా) చేసిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగాన్ని రంగంలోకి దించింది. ఇందుకోసం ఆడియో రికార్డుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అలాగే, శ్రీధర్ రెడ్డితో ఫోనులో మాట్లాడిన రామశివారెడ్డిని కూడా విచారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
బుధవారం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులతో సమావేశమై కోటంరెడ్డి చేసిన ఆరోపణలపై సుధీర్ఘంగా చర్చించారు. 
 
ఆ తర్వాత ఇంటెలిజెన్స్ విభాగాన్ని రంగంలోకి దించి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా ఇప్పటికే రామశివారెడ్డి కాల్ డేటాను సేకరించినట్టు సమాచరాం. అయితే, సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యవహారం ఎంతదూరం వెళుతుందో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments