Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనార్టీ కుటుంబం సెల్ఫీ వీడియోపై సీఎం జగన్ స్పందన

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (23:33 IST)
అమరావతి: కడప జిల్లా దువ్వూరుకు చెందిన ఓ మైనార్టీ కుటుంబం సోషల్‌ మీడియాలో పెట్టిన సెల్ఫీ వీడియోపై సీఎం జగన్‌ స్పందించారు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌తో మాట్లాడారు. ఎస్పీకి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. వారంలో సమస్య పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్‌కు సీఎం ఆదేశించారు. మైదుకూరు గ్రామీణ సీఐ వ్యవహారంపై విచారణ జరిపి వారంలోగా చర్యలు తీసుకోవాలన్నారు. భూమికి సంబంధించి వారంలో కలెక్టర్‌ విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
 
వీడియోపై రాత్రే స్పందించాం: ఎస్పీ
అంతకముందు సెల్ఫీ వీడియో చూసి అక్బర్‌ బాషా కుటుంబాన్ని ఎస్పీ తన వద్దకు పిలిపించుకున్నారు. బాధిత కుటుంబం, కడప వైకాపా నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అక్బర్‌బాషా సెల్ఫీ వీడియోపై రాత్రి 11.20 గంటలకు స్పందించామన్నారు. వెంటనే బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నట్లు వివరించారు.

ఈ నెల 9న ఎస్పీ స్పందన కార్యాలయంలో అక్బర్‌ పిటిషన్‌ ఇచ్చారని తెలిపారు. ‘‘సీఐ వ్యవహారంపై విచారణకు అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ను నియమించాంసీఐ కొండారెడ్డిని 2 రోజుల పాటు విధుల నుంచి తప్పించాం. భూ సమస్య పరిష్కరించాలని సీఎంవో కూడా ఆదేశాలిచ్చింది’’ అని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.*

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments