Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్‌లైన్‌ కాల్‌మనీ వ్యవహారాలపై దృష్టిపెట్టండి : సీఎం ఆదేశం

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (19:21 IST)
ఆన్‌లైన్‌ కాల్‌మనీ వ్యవహారాలపై దృష్టిపెట్టాలని సీఎం వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. సీఎంఓ కార్యాలయ అధికారులతో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు ఇచ్చారు. యాప్‌ల ద్వారా అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి, ఆ రుణాలు వసూలు చేయడానికి చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్నారన్న సమాచారం నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాల్‌మనీ వ్యవహారాలను ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 
 
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఆత్మహత్యకు పాల్పడిన బాధిత కుటుంబాలకు సీఎం వైయస్‌.జగన్‌ ఆర్థికసాయం ప్రకటించారు. గుంటూరు జిల్లా కొర్రపాడులో ఆత్మహత్యచేసుకున్న పదోతరగతి బాలిక సౌమ్య కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం చేయాలని సీఎం ఆదేశించారు. లైంగిక వేధింపుల కారణాలతో తాను ఆత్మహత్యచేసుకున్నట్టుగా మృతురాలి వీడియో బయటకు వచ్చింది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణం దశరాజుపల్లెలో జరిగిన సజీవదహన ఘటనలో మరణించిన దివ్యాంగురాలు, వలంటీర్‌ భువనేశ్వరి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం