Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (09:32 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌కు అర్చకులు స్వాగతం ఇచ్చారు. సీఎంకు వేద మంత్రోచ్ఛారణలు, సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఆలయంలోకి తీసుకెళ్లారు
 
పూజల అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం స్వీకరించి టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు రామచంద్రారెడ్డి, రోజా, టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి, ఇతర రాష్ట్ర, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
 
మరోవైపు ఈ ఏడాది తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఏడుకొండల స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల కోసం పట్టుబట్టలను సమర్పించడం ఆనవాయితీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments