Webdunia - Bharat's app for daily news and videos

Install App

వక్ఫ్ భూములను కాపాడండి.. జగన్ ఆదేశాలు

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (21:53 IST)
వక్ఫ్ భూములను కాపాడేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మైనార్టీ సంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ భూములపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో భాగంగా.. భూముల చట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా వీటి నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించాలన్నారు. 
 
జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు వక్ఫ్ ఆస్తుల సర్వే కూడా చేపట్టాలని చెప్పారు. అలాగే మైనార్టీల అవసరాలకు తగ్గట్టుగా కొత్త స్మశానాల నిర్మాణాలను చేపట్టాలని సీఎం ఆదేశించారు. మైనార్టీల సబ్ ప్లాన్ కోసం రూపొందించిన ప్రతిపాదనలపై తగిన చర్యలు తీసుకోవాలని జగన్ చెప్పారు. ఇమామ్ లు, మౌజంలు, పాస్టర్లకు సకాలంలో గౌరవ వేతనాలను చెల్లించాలని అన్నారు. 
 
గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో హజ్ హౌస్ ల నిర్మాణానికి జగన్ ఆమోదం తెలిపారు. దీనికి తోడు… అసంపూర్ణంగా ఉన్న క్రిస్టియర్ భవన్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కర్నూలులో ఉర్దూ యూనివర్శిటీకి ప్రాధాన్యతనిచ్చి పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పారు. షాదీఖానాల నిర్వహణను ఇక నుంచి మైనార్టీ శాఖకు బదిలీ చేయాలని తెలిపారు. ఇక కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments