Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. వారికి కారుణ్య నియామకాల ఉద్యోగాలు

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (22:21 IST)
ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30 నాటికి అ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం అన్నారు. 
 
వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణం, విలేజ్ అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటు, రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్, ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది నియామకంపై సీఎం సీమీక్షించారు.
 
ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ రూపొందించామని.. ఈనెల 20న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 176 కొత్త పీహెచ్ సీల నిర్మాణంపై దృష్టి పెట్టాలని అన్నారు. 
 
జనవరిలో పనులు ప్రారంభించి 9 నెలల్లో పనులు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments