Webdunia - Bharat's app for daily news and videos

Install App

19న విద్యా దీవెన నిధులు జమ : సీఎం జగన్ వెల్లడి

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (14:12 IST)
ఈ నెల 19వ తేదీన విద్యా దీవెన కింద అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి ఈ నిధులను జమ చేస్తారని ప్రభుత్వం తెలిపింది. 
 
నిజానికి ఈ నెల 18వ తేదీన తిరువూరులో సీఎం జగన్ పాల్గొనే బహిరంగ సభ జరగాల్సివుంది. అయితే, సభ జరిగే ప్రాంగణానికి సమీపంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉంది. ఇక్కడ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో ఈ సభను మరుసటిరోజుకు వాయిదావేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్య కలగరాదన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి సభను ప్రభుత్వ అధికారులు మరుసటి రోజుకు వాయిదావేశారు. 
 
కాగా, జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన పేద విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తుంది. ఇంజనీరింగ్, వైద్య, డిగ్రీ, తదితర కోర్సులు చేసే విద్యార్థులకు రూ.20 వేలు ఇందిస్తుంది. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు చొప్పున అందిస్తుంది. ఈ విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులను ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments