Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జవాద్' తుఫాను భయం : మూడు జిల్లాలకు అలెర్ట్ ... మానిటరింగ్ ఆఫీసర్లు

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (13:24 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణం కాస్త తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫానుకు జవాద్ అనే పేరు పెట్టనున్నారు. ఈ తుఫాను ప్రభావం కారణంగా శుక్రవారం నుంచి ఏపీలోని విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆ జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. 
 
అలాగే, తుఫాను ప్రభావం అధికంగా ఉండే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు ప్రత్యేక పర్యవేక్షక అధికారులను ముఖ్యమంత్రి ఏపీ సీఎం జగన్ నియమించారు. శ్రీకాకుళంకు హెచ్. అరుణ్ కుమార్, విజయనగరంకు కాంతాలాల్ దండే, విశాఖ జిల్లాకు శ్యామలా రావును నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. 
 
ఈ అధికారులు తక్షణం ఆయా జిల్లాలకు వెళ్లి పరిస్థితులను సమీక్షించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా లోతట్టు, ముంపు ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంత త్వరగా సహాయ, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలపై అధికంగా ఉండనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments