Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాణాసంచా గోడౌన్‌లో పేలుడు.. ఏడుగురు మృతి.. కుటుంబానికి రెండు లక్షలు ఎక్స్‌గ్రేషియా..!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (09:05 IST)
విశాఖపట్నం జిల్లాలో సంభవించిన బాణాసంచ గోడౌన్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. క్షతగాత్రుల్లో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలుపుతూ.. ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు.
 
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని విశాఖ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. 
 
జిల్లాలోని ఎస్. రాయవరం మండలం గోకులపాడులోని బాణాసంచా గోడౌన్లో ఆదివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. కాగా ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో 16నుంచి 18మంది వరకు కూలీలు పనిచేస్తున్నట్టు అక్కడి స్థానికులు చెబుతున్నారు. బాణాసంచా పేలుడు ఘటనలో బాధితులంతా కూలీలేనని పోలీసులు తెలిపారు. 
 
క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్, నక్కపల్లి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్టు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు చేపట్టకుండా మందుగుండును నిలువ ఉంచడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments