Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసులో ఇక వ‌రుస‌గా సినీ స్టార్స్ ఇడి విచార‌ణ‌కు పిలుపు

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (10:30 IST)
హైద‌రాబాదులో సంచ‌ల‌నం క‌లిగించిన డ్ర‌గ్స్ కేసులో ఈడీ దర్యాప్తు తిరిగి ముమ్మరం అవుతోంది.  నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఈ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వ‌చ్చింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ఎన్‏ఫోర్స్‏మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. 
 
ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ స్టార్స్ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జగన్నాధ్ ను ఆగస్టు 31న ఈడీ ఎదుట హాజ‌రు కావాల‌ని పిలిచారు. హీరోయిన్, నిర్మాత ఛార్మి కౌర్ ను సెప్టెంబర్ 2 పిలిచారు. ఇక లీడింగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని సెప్టెంబర్ 6, రాణా దగ్గుబాటిని సెప్టెంబర్ 8 హాజ‌రుకావాల‌ని పిలిచారు. 
 
హీరోలు రవితేజ, శ్రీనివాస్ ల‌ను సెప్టెంబర్ 9, నవదీప్,  ఎఫ్ ఎం క్ల‌బ్ జి.ఎం ల‌ను సెప్టెంబర్ 13న విచార‌ణ‌కు పిలిచారు. న‌ర్త‌కి ముమైత్ ఖాన్ ని సెప్టెంబర్ 15న‌, హీరో తనీష్ ను సెప్టెంబర్ 17 పిలిచారు. ఇక నందుని  సెప్టెంబర్ 20, తరుణ్ ని సెప్టెంబర్ 22 న హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments