Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండపై శిలువ గుర్తు... తితిదే విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం

Webdunia
ఆదివారం, 15 ఆగస్టు 2021 (09:53 IST)
తిరుమల కొండపైకి వచ్చిన ఓ కారుకు శిలువ గుర్తువున్నది. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విషయంలో తితిదే విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. 
 
తిరుమ శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ ఇండికా కారుపై శిలువ గుర్తును గమనించకుండా సదరు వాహనాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమలకు అనుమతించారు. తనిఖీల సమయంలో కారును క్షుణంగా తనిఖీ చేయని విజిలెన్స్ సిబ్బంది.. శిలువ గుర్తు ఉన్న ఆ ఇండికా కారు తిరుమలకు అనుమతించారు.
 
అయితే టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా కారు వెనుక అద్దంలో ‘శిలువ గుర్తు, ave Maria’ అనే అన్యమత శ్లోకంతో ఆ కారు తిరుమలకు వచ్చింది. అయితే ఇది గమనించిన.. కింది స్థాయి అధికారులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ కారును పట్టుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాహనంగా గుర్తించారు. 
 
తాము హిందువులమేనని, తిరుమల యాత్ర కోసం కారు అద్దెకు తీసుకున్నామని వాహనంలోని భక్తులు తెలిపారు. అనంతరం అన్యమత చిహ్నాన్ని తొలగించి దర్శనానికి అనుమతించాలని కోరడంతో విజిలెన్స్‌ సిబ్బంది సదరు భక్తులను అనుమతించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments