Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితుడితో రహస్య సంబంధం పెట్టుకునీ.. చివరకు...

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (17:25 IST)
చిత్తూరు జిల్లాలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని కార్వేటినగరంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, కార్వేటి నగరం మండపం ఎంఎం విలాసం పంచాయతీ పరిధిలోని గుండ్రాజు ఇళ్ళకు చెందిన కె.గురుమూర్తి అనే వ్యక్తి రామకుప్పం మండలం గురుకులమడుగు ప్రాథమిక పాఠశాలల్లో ఎనిమిదేళ్లుగా టీచర్‌గా పని చేస్తున్నాడు.
 
అదే గ్రామానికి చెందిన కళావతి, చెల్లప్పనాయుడు కుమార్తె శ్రావణి(21) అతనితో చనువుగా ఉండేది. శ్రావణికి పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పడమేకాకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఆమెను మూడు రోజుల క్రితం గురుమూర్తి కార్వేటినగరంలో అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకొచ్చాడు. 
 
శ్రావణి ఒక రోజు రాత్రంతా ఆయనతోనే ఉన్నది. ఇంతలో వారిమధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, శ్రావణి వంట గదికి గడియపెట్టి ఫ్యాన్‌ కొక్కికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments