Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై చిరంజీవి విమర్శలు.. హుదూద్‌లో కూడా వ్యక్తిగత ప్రచారమేనా?

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (16:53 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గురువారం తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఓ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ.. హుదూద్ తుఫాను సమయంలోనూ చంద్రబాబు ప్రచారం కోసం వెంపర్లాడారని ఎద్దేవా చేశారు. 
 
తుఫాను బాధితులను ఆదుకోవడంలో బాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. తుఫాను వస్తుందన్న సూచనలను సర్కారు పట్టించుకోలేదని, అందుకే ప్రాణనష్టం జరిగిందని అన్నారు. 
 
పంటపొలాల్లో రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. భూసేకరణ అంశంలో రైతులను ఒప్పించాలే తప్ప, బలవంతం చేయరాదని అన్నారు. రైతులతో సున్నితంగా వ్యవహరించాలని చిరంజీవి హితవు పలికారు. 
 
నల్లధనం వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెదిరింపు ధోరణితో నడుచుకుంటోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నల్లధనాన్ని స్వదేశానికి తెస్తామని ప్రకటించిన బీజేపీ.. 150 రోజులు గడుస్తున్నా ఆ పని చేయలని మండిపడ్డారు. పైగా, వందలాది మంది పేర్లు ఉంటే కేవలం మూడు పేర్లు మాత్రమే బీజేపీ బయటపెట్టిందని విమర్శించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments