ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావకు మంగళం...

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (14:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేస్తున్న రాగి జావను నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒంటిపూట బడుల సాగుతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాగి జావ స్థానంలో చిక్కీలను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో రాగిజావ పంపిణీ కార్య క్రమం మూణ్నాళ్ల ముచ్చటగా ముగిసింది. 
 
ప్రస్తుత విద్యా సంవత్సరం ఏప్రిల్ నెలాఖరు వరకు ఉన్నప్పటికీ పంపిణీ నిలిపివేయాలంటూ మధ్యాహ్న భోజన విభాగం డైరెక్టర్ నిధి మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాగి జావకు బదు లుగా చిక్కీలు పంపిణీ చేయాలని సూచించారు. పాఠశాలల పనివేళల్లో చేసిన మార్పుల కారణంగా దీనిపై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 
 
అయితే సవరించిన పనివేళలతో పంపిణీకి వచ్చిన ఇబ్బందేమిటో ఆ ఉత్తర్వుల్లో వివరించలేదు. ఈ ఏడాది మార్చి 21న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. మంగళ, గురు, శనివారాల్లో పంపిణీ మొదలుపెట్టారు. ఇంతలోనే ఈ ఏడాదికి ఇక చాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మాత్రం దానికి ఇంత హడావిడిగా ఎందుకు ప్రారంభించడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments