Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్లెల్లో ప్రలోభాలపర్వం.. చికెన్, మటన్, చీరలు, మందు

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (18:30 IST)
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల పోరు చివరి దశకు వచ్చేసరికి పల్లెల్లో ప్రలోభాలపర్వం జోరందుకుంది. పల్లె పగ్గాల కోసం అభ్యర్థులు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. కొన్ని చోట్ల అడిగినంత ముట్టజెప్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఓటర్లు ఏమడిగితే అది కొనిస్తున్నారు. 
 
ఇక చివరి నిముషంలో చికెన్, మటన్, చీరలు, మందు ఇలా ఓటర్లను కానుకలతో ముంచేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓటుకు రూ.200 నుంచి రూ.10వేల వరకు పంచిన ఘటనలు ఏపీలో చోటు చేసుకున్నాయి. 
 
ముఖ్యంగా మూడో విడత ఎన్నికల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల్లో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.4వేల వరకు పంపిణీ చేశారు. అంతేకాదు సొంతపార్టీకి చందిన చెందిన వారికి తక్కువ మొత్తం.. ప్రత్యర్థి పార్టీకి ఓట్లు వేస్తారనుకున్నవారికి ఎక్కువ మొత్తంలో డబ్బులిచ్చారు.
 
ఇక ఓ గ్రామంలో సర్పంచ్ పదవికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడటంతో పోటీపడి మరీ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. వారిలో ఓ అభ్యర్థి ఓటుకు రూ.1200 ఇవ్వడమే కాకుండా.. కిలో చికెన్, 30 కోడిగుడ్లను పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments