Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదుగో చిరుత... తిరుమలలో అర్థరాత్రి కలకలం.. భయంతో భక్తుల పరుగులు

తిరుమలలో అర్థరాత్రి చిరుత భక్తులను హడలెత్తించింది. పద్మావతినగర్‌లోని నర్సింగ్‌ సదన్‌ విశ్రాంతి గృహంలోకి ఒక చిరుత ప్రవేశించింది.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (11:36 IST)
తిరుమలలో అర్థరాత్రి చిరుత భక్తులను హడలెత్తించింది. పద్మావతినగర్‌లోని నర్సింగ్‌ సదన్‌ విశ్రాంతి గృహంలోకి ఒక చిరుత ప్రవేశించింది. నర్సింగ్‌ సదన్‌ వెనుకే అటవీ ప్రాంతం ఉండడంతో చిరుత వచ్చినట్లు అటవీశాఖాధికారులు చెబుతున్నారు. నర్సింగ్‌ సదన్‌లోని మొదటి అంతస్తులోకి చిరుత ప్రవేశించింది. 
 
చిరుతను చూసిన అక్కడ పనిచేసే సిబ్బంది వెంకటేష్‌, ప్రభాకర్‌లు రెండవ అంతస్తుకు పరుగులు తీశారు. వీరిద్దరు భవనంపైకి ఎక్కి మరొక భవనంపై ఎక్కి కిందకు దిగి తితిదే, అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అటవీ, అగ్నిమాపక, తితిదే విజిలెన్స్, పోలీసు శాఖలు రంగగంలోకి దిగి మంగళవారం తెల్లవారుజాము వరకు చిరుతను పట్టుకునే ప్రయత్నం చేశారు.
 
అయితే చిరుత నర్సింగ్‌ సదన్‌ నుంచి మెల్లగా తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. చిరుత ఉందన్న విషయం తెలుసుకున్న నర్సింగ్‌ సదన్‌లో గదులు అద్దెకు తీసుకున్న భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. అయితే అటవీశాఖాధికారులు వారికే ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. చిరుత అటవీప్రాంతంలోకి వెళ్ళిపోయిందని తెలుసుకున్న భక్తులు వూపిరి పీల్చుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments