Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024లో చంద్రబాబు చస్తారు.. జగన్ మళ్లీ సీఎం అవుతారు : వైకాపా ఎంపీ గోరంట్ల

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (12:03 IST)
వైకాపాకు చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధమ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2024లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చస్తారని, తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ ఆయన జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. 
 
వైకాపా చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ, 2024లో చంద్రబాబు చస్తారని, జగన్ సీఎం అవుతారని చెప్పారు. చంద్రబాబు బస్సు యాత్ర చేసి ఇపుడు జైలు యాత్ర చేస్తున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసి ఇపుడు పారిపోయే యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 
 
ఇక నారా లోకేశ్ యువగళం యాత్ర చేసి ఇపుడు ఢిల్లీ చుట్టూ తిరిగే యాత్ర చేస్తున్నారని అన్నారు. లోకేశ్ పాదయాత్రను పక్కనపెట్టి పారిపోయారన్నారు. మరోవైపు, చంద్రబాబును ఉద్దేశించి ఈ వైకాపా ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. జైల్లో చంద్రబాబుకు ఏదైనా అపకారం తలపెట్టే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ నాకు బాగా నచ్చింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

యువతను ఆకట్టుకునేలా మ్యానిప్యూలేటర్ టైటిల్ వుందన్న బి.గోపాల్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

గోవాలో తాగిపడిపోతే సుప్రీత ఆ పని చేసింది : అమర్ దీప్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments