హల్లో నాని... నేను, ఏంటి పార్టీ మారుతున్నావట.. నానికి చంద్రబాబు ఫోను

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (18:26 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన ఢిల్లీలోని బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్టు జోరుగా కథనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేశినేని నానితో టీడీపీకి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా విజయవాడలో సమావేశమై మంతనాలు జరిపారు. ఆ తర్వాత నాని పార్టీ మారడం లేదంటూ మీడియాకు వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో కేశినేని నానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్ చేసి.. తన నివాసానికి రావలసిందిగా కోరినట్టు తెలుస్తోంది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతల నియామక విషయంలో ఇటీవల జరిగిన పరిణామాలు నానికి మనస్తాపం కలిగించాయన్నది లోగుట్టు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయనను పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
మరోవైపు, నాని బీజేపీలో చేరవచ్చంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి బలం చేకూర్చేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని నాని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో నాని పార్టీ మారడం ఖాయమంటున్నారు. ఇపుడు నానికి చంద్రబాబు ఫోన్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. 
 
మొత్తంమీద కేశినేని నాని అంశం ఇపుడు టీడీపీలో కలకలం రేపుతోంది. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 25 ఎంపీ సీట్లకుగాను కేవలం మూడు ఎంపీలు గెలిచారు. వారిలో ఒకరు కేశినేని నాని. విజయవాడ లోక్‌సభ స్థానం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments