Webdunia - Bharat's app for daily news and videos

Install App

హల్లో నాని... నేను, ఏంటి పార్టీ మారుతున్నావట.. నానికి చంద్రబాబు ఫోను

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (18:26 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన ఢిల్లీలోని బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్టు జోరుగా కథనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేశినేని నానితో టీడీపీకి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా విజయవాడలో సమావేశమై మంతనాలు జరిపారు. ఆ తర్వాత నాని పార్టీ మారడం లేదంటూ మీడియాకు వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో కేశినేని నానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్ చేసి.. తన నివాసానికి రావలసిందిగా కోరినట్టు తెలుస్తోంది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతల నియామక విషయంలో ఇటీవల జరిగిన పరిణామాలు నానికి మనస్తాపం కలిగించాయన్నది లోగుట్టు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయనను పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
మరోవైపు, నాని బీజేపీలో చేరవచ్చంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి బలం చేకూర్చేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని నాని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో నాని పార్టీ మారడం ఖాయమంటున్నారు. ఇపుడు నానికి చంద్రబాబు ఫోన్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. 
 
మొత్తంమీద కేశినేని నాని అంశం ఇపుడు టీడీపీలో కలకలం రేపుతోంది. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 25 ఎంపీ సీట్లకుగాను కేవలం మూడు ఎంపీలు గెలిచారు. వారిలో ఒకరు కేశినేని నాని. విజయవాడ లోక్‌సభ స్థానం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments