Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఈ-కేబినెట్ భేటీ.. ఓ లుక్కేసిన నరేంద్ర మోడీ కార్యాలయం!

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (17:14 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న రీతిలో సోమవారం నిర్వహించిన ఈ-క్యాబినెట్ సమావేశం (కాగితరహిత భేటీ)పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం (పీఎంఓ) ఓ లుక్కేసింది. ఈ-కేబినెట్ సమావేశం ఎలా నిర్వహించారన్న అంశంపై ఆసక్తి చూపిన పీఎంఓ.. ఈ-కేబినెట్ నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను తమకివ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. 
 
సోమవారం చంద్రబాబు నేతృత్వంలో నిర్వహించిన కేబినెట్ భేటీని కాగితం, పెన్ను లేకుండా సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు జరిగింది. ఈ భేటీ కోసం ఐపాడ్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లతో సమావేశం నిర్వహించారు. దాంట్లో పలు పథకాలపై చర్చించారు. ఈ భేటీకి మీడియా విశేష ప్రచారం కల్పించింది. దీంతో, ప్రధాని కార్యాలయం కూడా ఇటువైపు ఓ కన్నేసింది. ఏపీ సర్కారు జరిపిన హై-ఫై భేటీకి సంబంధించిన వివరాలు అందించాలని అధికారులను కోరింది. 
 
అంతముందు.. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నాలుగు గంటలకు పైగా జరిగింది. వందరోజుల పాలన... మంత్రుల పనితీరు తదితర విషయాలపై కేబినెట్ చర్చించింది. దేశంలోనే తొలి ఈ-కేబినెట్ సమావేశంగా ఈ భేటీ చరిత్ర సృష్టించింది. తొలిసారిగా కాగిత రహిత కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి ఏపీ సర్కార్ అందరినీ ఆశ్చర్యపరిచింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments