Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకు సీఎం చంద్రబాబు చేసిన ఆ పని జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? ఎవరు?

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (16:24 IST)
అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ముఖ్యమంత్రి ముస్లింలకు పది క్యాబినెట్ ర్యాంకు పదవులు ఇచ్చారని, రాజకీయ అవకాశాల విషయంలో ఇదో సువర్ణాధ్యాయం అని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎం.డి.హిదాయత్ సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కొనియాడారు. సీనియర్ ప్రజాప్రతినిధులు ఎన్.ఎం.డీ.ఫరూక్‌కు మంత్రి పదవి, శాసన మండలి ఛైర్మన్‌గా ఎం.ఏ.షరీఫ్‌లను నియమించడంతోపాటు, ఒకరికి ప్రభుత్వ విప్, ఏడుగురు ముస్లింలకు కార్పొరేషన్ పదవులు, ఇద్దరిని మేయర్లుగా, ఒకరికి జడ్పీఛైర్మన్ పదవి కల్పించడం, ముస్లింలందరికీ దక్కిన గౌరవం అని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
మైనారిటీ వర్గాలు సుఖంగా ఉండటం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా అని హిదాయత్ ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో ముస్లింలకు జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని వైసీపి నేతలకు హిదాయత్ సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ముస్లిం కార్పొరేషన్లకు కనీసం ఛైర్మన్లను కూడా నియమించలేదని, కడప, హైదరాబాద్‌లలో వందల కోట్ల విలువైన వక్ఫ్ భూములు ఆక్రమించుకున్నారని ఆయన విమర్శించారు.
 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన బావమరిది కడపలో వక్ఫ్ భూములు ఆక్రమించి పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు నిర్మించుకున్నారని హిదాయత్ ధ్వజమెత్తారు. వైఎస్ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని ఆయన విమర్శించారు.
 
ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని, కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు నాయుడు ధైర్యంగా పోరాడుతున్నారని హిదాయత్ కొనియాడారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా ఆ ప్రభావం మైనారిటీలపై పడకుండా, నాలుగున్నర సంవత్సరాల టీడీపీ పాలనలో మైనారిటీల కోసం రూ.2800 కోట్లు కేటాయించి ఖర్చు చేశారని, ఈ ఆర్ధిక సంవత్సరంలోనే మరో రూ.1100 కోట్లు కేటాయించడం చరిత్రలో ఎన్నడూ లేదని హిదాయత్ గుర్తుచేశారు. టీడీపీ పాలన మైనారిటీల పాలిట స్వర్ణయుగం అన్నారు. 
 
గతంలో అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలకపాత్ర పోషించారని ఆయన గుర్తుచేశారు. నాలుగున్నర సంవత్సరాల టీడీపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగా ఉన్నాయని, ముస్లిం సమాజం మొత్తం టీడీపీతోనే పయనించాలని నిర్ణయించిందని హిదాయత్ అభిప్రాయపడ్డారు. సీఎంగా మరలా చంద్రబాబు నాయుడు రావాలని ముస్లింలు కోరుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments