చంద్రబాబుకు మానవత్వం లేదు... ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు : సజ్జల

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (17:13 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు కొంచెం కూడా మానవత్వం లేదన్నారు. అందుకే ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన వ్యవహారశైలిని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. 
 
చంద్రబాబు కుప్పం టూర్‌పై ఆయన స్పందిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై సభలను నిర్వహించడం సరికాదన్నారు. పైగా, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 1 పోలీస్ చట్టానికి లోబడే ఉందన్నారు. ఈ జీవోను పట్టించుకోబోమని టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారని, చట్టాన్ని ఉల్లంఘించడం సరికాదన్నారు. 
 
చంద్రబాబు చేపట్టిన కుప్పం యాత్ర ప్రభుత్వంపై దండయాత్రలా మారిందన్నారు. చంద్రబాబు ఒక ఉన్మాదిలా మారారని ఆరోపించారు. కందుకూరు, గుంటూరుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబుకు కనీస మానవత్వం కూడా లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments