రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ.. త్వరలోనే చెలామణిలోకి...

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (10:21 IST)
దివంగత నటుడు, మహానేత ఎన్.టి.రామారావు బొమ్మతో కూడిన వంద రూపాయల నాణెం అందుబాటులోకి రానుంది. ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెంను ముద్రించేందుకు భారత రిజర్వు బ్యాంకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రతిపాదిత నాణెం నమూనాను కూడా ముద్రించారు. దీన్ని ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి, ఏపీ బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరికి ఆర్బీఐ మింట్ అధికారులు చూపించారు. ఈ నాణెం నమూనాపై ఆమె నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ నమూనాకు కూడా ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. దీంతో త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో కూడా వంద రూపాయల నాణె చెలామణిలోకి వచ్చే అవకాశం ఉంది.
 
మరోవైపు, ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం నిర్వహిస్తున్నారు. దీనిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పేదలు, బలహీన వర్గాలకు సాయపడాలన్న ఉద్దేశ్యంతో ఏర్పడిన ఈ ట్రస్ట్‌కు వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు చెప్పారు. 
 
అలాగే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ, మాహానాయుడు ఎన్టీఆర్ ఆశయాలు, ఆచరణ రూపం ఎన్టీఆర్ ట్రస్టుగా అభివర్ణించారు. విపత్తుల వేళ బాధితులను ఆదుకోవడంలోనూ విద్య వైద్య విజ్ఞాన ఉపాధి రంగాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments