Webdunia - Bharat's app for daily news and videos

Install App

హయ్ ఎలా ఉన్నారు..? అరెరె మీరా.. బాగున్నారా..? బాబు కేసీఆర్ కుశల ప్రశ్నలు..

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (06:38 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు ఒకే వేదికపై కనిపించారు. రోజూ ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకునే ఈ నేతల మధ్య ఆసక్తికరమైన సంభాషణలు చోటు చేసుకున్నాయి. ఎలా ఉన్నారు? అని ఒకరు ప్రశ్నిస్తే.. అరెరె మీరా బాగున్నారా..? అంటూ మరొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? 
 
రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్భవన్లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు స్పీకర్లు, మంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కేసీఆర్ చాలా సేపు మాట్లాడుకున్నారు. 
 
గవర్నర్ కు ఇరువైపుల చెరొకరుగా ఆసీనులయిన వారు గవర్నర్ లేని సమయంలో చాలా కుశల ప్రశ్నలు వేసుకుంటూ మాట్లాడుకోవడం ఆసక్తికరంగా కనిపించింది. వీరిద్దరూ పలు విషయాల గురించి చర్చంచుకున్నారు. ఇరు రాష్ట్రల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి గవర్నర్ చొరవ చూపారు.  ఈ కార్యక్రమం అనంతరం గవర్నర్.. చంద్రబాబు, కేసీఆర్లతో ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాల గురించి చర్చించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments