Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నాయుడు వంశంలోనే పిచ్చి: అంబటి వ్యాఖ్య

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (19:31 IST)
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది అదో రకం పిచ్చి అని, ఆయన బావమరిది బాలకృష్ణకు మతిస్థిమితమని వైకాపా నేత అంబటి రాంబాబు ఆరోపించారు. పైగా.. చంద్రబాబు నాయుడు వంశంలోనే పిచ్చి ఉందన్నారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ అధికార పక్షంపై విపక్షాలు విమర్శలు చేస్తే సహృదయంతో స్వీకరించాల్సిన టీడీపీ నేతలు ఎదురు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. 
 
ముఖ్యంగా.. జగన్‌కు మతిస్థిమితం లేదన్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ మాటకొస్తే చంద్రబాబు బావమరిది బాలకృష్ణకు మతిస్థిమితం లేదని వైద్యులు ధ్రువీకరించిన సంగతి వాస్తవం కాదా? అని అంబటి ప్రశ్నించారు. 
 
అలాగే చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు మతిస్థిమితం లేక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం వాస్తవం కాదా? అని అడిగారు. అంతెందుకు, చంద్రబాబుకు జగన్‌కు వైద్యపరీక్షలు చేద్దాం, చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యవంతుడన్నా, జగన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని నివేదిక ఇచ్చినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అంబటి రాంబాబు ప్రకటించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments