వైకాపా రంగుల పిచ్చి పీక్ : తిరుపతి గంగమ్మ జాతర అలంకరణను కూడా వదిలిపెట్టలేదు...

Webdunia
బుధవారం, 17 మే 2023 (08:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా ప్రభుత్వానికి రంగుల పిచ్చి బాగా పట్టిందంటూ విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. వీటిని నిజం చేసేలా వైకాపా నేతల తీరు కూడా ఉంది. వైకాపా ఆధ్వర్యంలో జరిగే ప్రభుత్వ లేదా ప్రైవేటు కార్యక్రమాల్లో వైకాపా జెండా రంగులు స్పష్టంగా కనిపించేలా అలంకరణలు ఉంటాయి. ఈ అలంకరణలు ఇపుడు జాతరలు, దేవుడి విశేష కార్యక్రమాలకు కూడా పాకింది. తాజాగా తిరుపతి గంగమ్మ జాతరలో ఇదే తరహా అంలకరణ కనిపించింది. 
 
గత కొన్ని రోజులుగా తాతయ్య గుంట గంగమ్మ జాతర జరుగుతోంది. అయితే, ఆలయం ముందు చేసిన అలంకారం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. జగన్ అనే అర్థ వచ్చేలా 'J' అని ఇంగ్లీష్ అక్షరం రాసి దానిపక్కన తుపాకీ బొమ్మ వేశారు. ఆ తర్వాత అటూ ఇటూగా వైకాపా జెండాను వేశారు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
దీనిపై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి గంగమ్మ గుడికి ఇలాంటి అలంకారమా? అంటూ మండిపడ్డారు. దేవుని సన్నిధిలో ఈ గన్ సంస్కృత్తి ఏంటి?, వైకాపా జెండా గుర్తులు ఏంటి? అంటూ నిలదీశారు. పిచ్చిపట్టిందా? 'J' అక్షరానికి గంగమ్మకి సంబంధం ఉందా? మీ ప్రచార పిచ్చితో, అహంకారంతో దేవుళ్ల దగ్గర ఇలాంటి పిచ్చి వేషాలా? అంటూ ఆయన నిప్పులు చెరిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments