Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫీజ్ కట్టలేదని.. లేటుగా వచ్చారని, హోమ్ వర్క్ చేయలేదని.. నగ్నంగా నిలబెట్టారు..

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (15:44 IST)
విద్యార్థులను నగ్నంగా నడిరోడ్డుపై నిలబెట్టిన విద్యా సంస్థ లైసెన్స్‌ను రద్దు చేశారు. హోమ్ వర్క్ చేయకుండా పాఠశాలకు వచ్చారనే కారణంతో కొందరు విద్యార్థులను నడిరోడ్డుపై నగ్నంగా నిలబెట్టిందో విద్యా సంస్థ. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు చైతన్య భారతి పాఠశాలలో చోటుచేసుకుంది. 
 
విద్యార్థులు హోమ్ వర్క్ రాసుకురాలేదని.. ఐదుగురు విద్యార్థుల బట్టలను ఊడదీయించిన టీచర్లు.. వారిని అందరూ చూసేలా స్కూలుకు వెలుపల నిలబెట్టారు. ఈ ఘటనపై వారి తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో విద్యాశాఖ స్పందించింది. 
 
ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు చైతన్య భారతి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. పాఠశాలలోని విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. హోమ్ వర్క్‌లు చేసుకోరాని పక్షంలో ఇలాంటి కఠినమైన శిక్షలను అమలు చేయడం ఏమిటని విద్యాశాఖ సీరియస్ అయ్యింది.
 
స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసింది. స్కూలుకు లేటుగా వస్తున్నారని, హోమ్ వర్క్ చేయలేదని, ఫీజులు సరిగ్గా కట్టట్లేదని చెప్తూ టీచర్ ఐదో తరగతి విద్యార్థుల బట్టలూడదీసి మండుటెండలో నిలబెట్టారని.. చిన్నారుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments