Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫీజ్ కట్టలేదని.. లేటుగా వచ్చారని, హోమ్ వర్క్ చేయలేదని.. నగ్నంగా నిలబెట్టారు..

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (15:44 IST)
విద్యార్థులను నగ్నంగా నడిరోడ్డుపై నిలబెట్టిన విద్యా సంస్థ లైసెన్స్‌ను రద్దు చేశారు. హోమ్ వర్క్ చేయకుండా పాఠశాలకు వచ్చారనే కారణంతో కొందరు విద్యార్థులను నడిరోడ్డుపై నగ్నంగా నిలబెట్టిందో విద్యా సంస్థ. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు చైతన్య భారతి పాఠశాలలో చోటుచేసుకుంది. 
 
విద్యార్థులు హోమ్ వర్క్ రాసుకురాలేదని.. ఐదుగురు విద్యార్థుల బట్టలను ఊడదీయించిన టీచర్లు.. వారిని అందరూ చూసేలా స్కూలుకు వెలుపల నిలబెట్టారు. ఈ ఘటనపై వారి తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో విద్యాశాఖ స్పందించింది. 
 
ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు చైతన్య భారతి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. పాఠశాలలోని విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. హోమ్ వర్క్‌లు చేసుకోరాని పక్షంలో ఇలాంటి కఠినమైన శిక్షలను అమలు చేయడం ఏమిటని విద్యాశాఖ సీరియస్ అయ్యింది.
 
స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసింది. స్కూలుకు లేటుగా వస్తున్నారని, హోమ్ వర్క్ చేయలేదని, ఫీజులు సరిగ్గా కట్టట్లేదని చెప్తూ టీచర్ ఐదో తరగతి విద్యార్థుల బట్టలూడదీసి మండుటెండలో నిలబెట్టారని.. చిన్నారుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments