Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే రాజధాని ఉండాలన్న నిబంధన ఎక్కడా లేదు : కేంద్రం క్లారిటీ

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (11:46 IST)
నవ్యాంధ్ర రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళంపై కేంద్రం మరోమారు క్లారిటీ ఇచ్చింది. రాజధాని అంశంలో జోక్యం చేసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. పైగా, విభజన చట్టం మేరకు ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని తేల్చి చెప్పింది. 
 
ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయబోతున్నట్టు సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ అంశం ఇపుడు కోర్టు పరిధిలోకి చేరింది. ఈ క్రమంలో రాజధాని అంశంలో జోక్యం చేసుకోబోమంటూ ఇప్పటికే  ఏపీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు అఫిడవిట్ దాఖలు చేసింది. 
 
తాజాగా ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ, హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానుల్లో కేంద్రం పాత్రపై మరింత క్లారిటీ ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు తప్పులేదని కేంద్రం తేల్చిచెప్పింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. 
 
మూడు రాజధానులపై కేంద్రం పాత్రపై పిటిషనర్‌ దోనే సాంబశివరావువి అపోహలేనని హోంశాఖ వెల్లడించింది. రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామని పేర్కొంది. రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో జోక్యం ఉండబోదని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టీకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments