Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.1438 కోట్లు విడుదల

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (08:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలతో కూడిన సీమాంధ్ర ప్రదేశ్ తీవ్రమైన రెవెన్యూ లోటును ఎదుర్కోంటుంది. ఈ లోటును విభజన హామీల్లో భాగంగా కేంద్రం భర్తీ చేయాల్సివుంది. కానీ కేంద్ర ఆ పని చేయడం లేదు. నామమాత్రంగానే రెవెన్యూ లోటును భర్తీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.1,438 కోట్లను కేంద్రం విడుదల చేసింది. 
 
ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను 17 రాష్ట్రాలకు మొత్తం రూ.9,871 కోట్లను మూడో విడత రెవెన్యూలోటు భర్తీ కింద విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,438 కోట్లు దక్కాయి. వీటితో కలుపుకుని రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ.4,314.24 కోట్లు అందాయి.
 
కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను 17 రాష్ట్రాలకు కలిపి రూ.1,18,452 కోట్ల రెవెన్యూ గ్రాంటును విడుదల చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా, ఈ మొత్తాన్ని 12 వాయిదాల్లో చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మొత్తం వాయిదాల్లో కలిపి ఏపీకి మొత్తంగా రూ.17,256.96 కోట్లు రానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments