Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.1438 కోట్లు విడుదల

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (08:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలతో కూడిన సీమాంధ్ర ప్రదేశ్ తీవ్రమైన రెవెన్యూ లోటును ఎదుర్కోంటుంది. ఈ లోటును విభజన హామీల్లో భాగంగా కేంద్రం భర్తీ చేయాల్సివుంది. కానీ కేంద్ర ఆ పని చేయడం లేదు. నామమాత్రంగానే రెవెన్యూ లోటును భర్తీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.1,438 కోట్లను కేంద్రం విడుదల చేసింది. 
 
ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను 17 రాష్ట్రాలకు మొత్తం రూ.9,871 కోట్లను మూడో విడత రెవెన్యూలోటు భర్తీ కింద విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,438 కోట్లు దక్కాయి. వీటితో కలుపుకుని రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ.4,314.24 కోట్లు అందాయి.
 
కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను 17 రాష్ట్రాలకు కలిపి రూ.1,18,452 కోట్ల రెవెన్యూ గ్రాంటును విడుదల చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా, ఈ మొత్తాన్ని 12 వాయిదాల్లో చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మొత్తం వాయిదాల్లో కలిపి ఏపీకి మొత్తంగా రూ.17,256.96 కోట్లు రానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments