దేశంలోని పలు ప్రాంతాలలోని షాపింగ్ మాల్స్లలో ఉన్న డ్రస్సింగ్ రూమ్లలో రహస్యంగా సీసీ కెమెరాలను ఉంచి వీడియోలు తీసి, పట్టుబడిన అనేక సంఘటనలు వెలుగు చూశాయి. తాజాగా అటువంటి సంఘటనే ఒకటి అనంతపురంలో చోటు చేసుకుంది. ఓ యువకుడు కళ్యాణ మండపాలలోని మహిళ స్నానపు గదుల్లో రహస్య సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు.
అక్కడ స్నానం చేసే మహిళలను వీడియో తీసి, వాటిని వాళ్లకు చూపి బెదిరించి డబ్బులు గుంజడం ప్రారంభించాడు. అతడి బారినపడిన మహిళల్లో కొందరు వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే అతనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించలేదు.