Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : సీఎం జగన్ తమ్ముడు, కడప ఎంపీ అవినాష్‌కు సీబీఐ పిలుపు

Webdunia
సోమవారం, 15 మే 2023 (22:01 IST)
వైకాపా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా, ఏపీ సీఎం, వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డికి వరుసకు తమ్ముడు అయ్యే కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నుంచి మరోమారు పిలుపువచ్చింది. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని సీబీఐ స్పష్టం చేసింది. కాగా వివేకా హత్య కేసులో అవినాష్ అనుమానితుడిగా ఉన్న విషయం తెల్సిందే. 
 
ఈ కేసు దర్యాప్తులో భాగంగా, ఈయన వద్ద సీబీఐ మూడుసార్లు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డికి సీబీఐ నుంచి మరోమారు పిలుపువచ్చింది. కాగా, ఈ కేసులో అరెస్టు భయంతో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, ఏప్రిల్ 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో వివేకా హత్య కేసులో అవినాష్ ఏ క్షణమైనా అరెస్టు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments