Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : సీఎం జగన్ తమ్ముడు, కడప ఎంపీ అవినాష్‌కు సీబీఐ పిలుపు

Webdunia
సోమవారం, 15 మే 2023 (22:01 IST)
వైకాపా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా, ఏపీ సీఎం, వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డికి వరుసకు తమ్ముడు అయ్యే కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నుంచి మరోమారు పిలుపువచ్చింది. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని సీబీఐ స్పష్టం చేసింది. కాగా వివేకా హత్య కేసులో అవినాష్ అనుమానితుడిగా ఉన్న విషయం తెల్సిందే. 
 
ఈ కేసు దర్యాప్తులో భాగంగా, ఈయన వద్ద సీబీఐ మూడుసార్లు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డికి సీబీఐ నుంచి మరోమారు పిలుపువచ్చింది. కాగా, ఈ కేసులో అరెస్టు భయంతో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, ఏప్రిల్ 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో వివేకా హత్య కేసులో అవినాష్ ఏ క్షణమైనా అరెస్టు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments