Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ మోహన్‌కు మరోసారి సీబీఐ నోటీస్

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (09:10 IST)
విశాఖలోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణ మోహన్‌కు మరోసారి సీబీఐ నోటీసులిచ్చింది. కోర్టులు, జడ్జీలపై వ్యాఖ్యల కేసులో గతంలో కృష్ణ మోహన్‌కు సీబీఐ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసందే.

ఈ నెల ఆరో తేదీన హాజరు కావాలని సీబీఐ నోటీస్ ఇచ్చింది. కానీ 6న హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐని ఆమంచి  కోరాడు. దీనితో రేపు విశాఖలోని సీబీఐ కార్యాలయానికి రావాలని మరోసారి కృష్ణ మోహన్‌కు సీబీఐ నోటీస్ ఇచ్చింది.

జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన సమయంలో ఏపీ హైకోర్టును, న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే అభియోగాలు ఆమంచిపై ఉన్నాయి. న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని  ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు పలువురిపై కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి.

సోషల్‌ మీడియా వేదికగా దూషణలు చేసిన వారిపై రాష్ట్ర హైకోర్టు చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. తీర్పులిచ్చిన న్యాయమూర్తులకు రాజకీయాలను అపాదించడం, వారిని భయభ్రాంతులకు గురి చేసేలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం సీబీఐ నోటీసులకు కారణమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments