Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ బెయిల్ పిటిషన్ వాయిదా : సీబీఐకు కోర్టు సీరియస్ వార్నింగ్

Webdunia
సోమవారం, 17 మే 2021 (13:44 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను మే 26వ తేదీకి వాయిదావేసింది. అదేసమయంలో సీబీఐకు కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు మరోమారు సమయం కోరడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశం అంటూ హెచ్చరిక చేసింది. 
 
కాగా, పలు అవినీతి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన సీఎం జగన్.. ప్రస్తుతం షరతుల బెయిల్‌పై ఉన్న విషయం తెల్సిందే. అయితే, ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, అందువల్ల జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ వైకాపాకే చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ నెల 7వ తేదీన దీన్ని కోర్టు విచారణకు స్వీకరించింది. ఆ సమయంలో కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలంటూ కోరడంతో ఈ నెల 17వ తేదీకి వాయిదావేసింది. ఆ ప్రకారంగా సోమవారం విచారణకు రాగా, మళ్లీ సమయం కావాలంటూ సీబీఐ తరపు న్యాయవాది కోరడంతో ఆగ్రహించిన న్యాయమూర్తి.. ఇదే చివరి అవకాశం అంటూ హెచ్చరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments