Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు నోటు కేసు: ఆ గొంతు చంద్రబాబుదే.. ఫోరెన్సిక్ రిపోర్ట్‌.. కేసీఆర్ ఏమన్నారంటే?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో టేపులో వినిపిస్తున్న గొంతు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుదేనని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. నాలుగు రోజుల క్రితమే ఫోరెన్సిక్స్ సైన్స్

Webdunia
మంగళవారం, 8 మే 2018 (09:10 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో టేపులో వినిపిస్తున్న గొంతు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుదేనని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. నాలుగు రోజుల క్రితమే ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్ నివేదిక తెలంగాణ పోలీసులకు అందింది. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. 
 
ఆ ఆడియో టేపులో వున్న గొంతు చంద్రబాబుదేనని తేలడంతో.. చట్టం ముందు అందరూ సమానమేనని.. కేసు విచారణలో ముందుకెళ్లండని అధికారులను కేసీఆర్ సూచించినట్లు సమాచారం. ఈ కేసులో జూలై 28, 2015న తొలి చార్జ్ షీట్ వేసిన ఏసీబీ, ఈ నెల చివరి వారంలో మరో చార్జ్ షీట్ వేయనున్నట్టు తెలిసింది. 
 
ఫోరెన్సిక్ నివేదిక వచ్చిందని తెలుసుకున్న కేసీఆర్.. ముందుగానే గవర్నర్ నరసింహన్‌ను కలిశారని.. కేసు గురించి కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూర్తిస్థాయి చార్జ్ షీట్ దాఖలుకు జీఏడీ అనుమతి తీసుకోగా, గవర్నర్ కూడా అనుమతించడంతో రెండు వారాల్లోనే కోర్టు ముందు చార్జ్ షీట్ దాఖలు చేస్తామని ఏసీబీ అధికార వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments