Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు నోటు కేసు: ఆ గొంతు చంద్రబాబుదే.. ఫోరెన్సిక్ రిపోర్ట్‌.. కేసీఆర్ ఏమన్నారంటే?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో టేపులో వినిపిస్తున్న గొంతు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుదేనని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. నాలుగు రోజుల క్రితమే ఫోరెన్సిక్స్ సైన్స్

Webdunia
మంగళవారం, 8 మే 2018 (09:10 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో టేపులో వినిపిస్తున్న గొంతు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుదేనని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. నాలుగు రోజుల క్రితమే ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్ నివేదిక తెలంగాణ పోలీసులకు అందింది. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. 
 
ఆ ఆడియో టేపులో వున్న గొంతు చంద్రబాబుదేనని తేలడంతో.. చట్టం ముందు అందరూ సమానమేనని.. కేసు విచారణలో ముందుకెళ్లండని అధికారులను కేసీఆర్ సూచించినట్లు సమాచారం. ఈ కేసులో జూలై 28, 2015న తొలి చార్జ్ షీట్ వేసిన ఏసీబీ, ఈ నెల చివరి వారంలో మరో చార్జ్ షీట్ వేయనున్నట్టు తెలిసింది. 
 
ఫోరెన్సిక్ నివేదిక వచ్చిందని తెలుసుకున్న కేసీఆర్.. ముందుగానే గవర్నర్ నరసింహన్‌ను కలిశారని.. కేసు గురించి కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూర్తిస్థాయి చార్జ్ షీట్ దాఖలుకు జీఏడీ అనుమతి తీసుకోగా, గవర్నర్ కూడా అనుమతించడంతో రెండు వారాల్లోనే కోర్టు ముందు చార్జ్ షీట్ దాఖలు చేస్తామని ఏసీబీ అధికార వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments