Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరులో పోలీసులపై తిరగబడిన స్థానికులు

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (09:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల వైఖరిపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. తాజాగా ఏలూరులో పోలీసులపై స్థానికులు దాడి చేశారు. కోడిపందాలు, పేకాట ఆడుతున్న బృందాలపై పోలీసులు దాడులు చేశారు. దీంతో తిరగబడిన స్థానికులతో కలిసి పేకాట రాయుళ్ళు పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఎస్ఐతో పాటు పలువురు కానిస్టేబుళ్ళను తరిమికొట్టారు. 
 
ఈ ఘటన ఏలూరు లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం మేరకు గ్రామంలో కొందరు వ్యక్తులు పేకాట, కోడిపందాలు ఆడుతున్నట్లు స్థానికుల సమాచారం మేరకు ధర్మాజీగూడెం పోలీసులు యడవల్లి గ్రామంలో దాడులు నిర్వహించారు.
 
పోలీసులను చూడగానే కార్డుదారులు ఎదురుపడి పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉమా మహేశ్వర్‌రావు, ఇతర కానిస్టేబుళ్లు గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలు రేపుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments