Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగి వద్ద కాలింగ్ బెల్ : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (17:05 IST)
కరోనా బాధితులకు సదుపాయాలు అందించడంలో విఫలమవంతున్నారంటూ సర్వత్రా విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం మేల్కొంది. కరోనా కట్టడికి ఏపీ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు మొదలు పెట్టింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల బెడ్స్ వద్ద కాలింగ్ బెల్స్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
 
కొన్ని ఆసుపత్రుల్లో వైద్యులు తరచుగా రోగుల వద్దకు వెళ్లడం లేదన్న విమర్శలు వస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రోగికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కాలింగ్ బెల్ నొక్కితే.. డాక్టర్ లేదా నర్సు వచ్చి అతడి పరిస్థితి పర్యవేక్షించాల్సి ఉంటుంది. 
 
రాష్ట్రంలో ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు వైద్యారోగ్య శాఖ సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు జారీ చేసింది. ఐసీయూ, నాన్‌ ఐసీయూ, ఆక్సిజన్, జనరల్‌ వార్డుల్లో ఈ బెల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. 
 
ఇక వీటన్నింటిని రిసెప్షన్‌కు అనుసంధానం చేస్తారు. రోగి బజర్ నొక్కిన దగ్గర నుంచి డాక్టర్ లేదా నర్సు వచ్చేవరకూ బెల్ మోగుతూనే ఉంటుంది. ఇక అటు రోగులకు అందిస్తున్న సేవల పరిశీలనకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments