శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

ఠాగూర్
శుక్రవారం, 17 అక్టోబరు 2025 (15:55 IST)
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఒకటైన శ్రీవారి లడ్డూ ప్రసాదం ధర పెంచబోతున్నారంటూ విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు వివరణ ఇచ్చారు. శ్రీవారి లడ్డూ ధరను పెంచే ఆలోచన తమకు ఏమాత్రం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారం, అవాస్తవమని ఆయన తేల్చి చెప్పారు. 
 
కొన్ని బాధ్యతారహిత మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తితిదే ప్రతిష్టకు, ఏపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతోనే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి నిరాధారమైన కథనాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. 
 
భక్తులు ఎవరూ ఈ వదంతులను నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదం ధరను పెంచే ప్రతిపాదన తితిదే వద్ద ఎపుడూ లేదని, భవిష్యత్‌లో కూడా అలాంటి ఆలోచన చేయబోమని బీఆర్ నాయుడు పునరుద్ఘాటించారు. తితిదేపై బురద చల్లే ప్రయత్నంలో భాగంగానే కొందరు ఇలాంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments