Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురి వల్ల ప్రాణహాని వుంది : బోరుగడ్డ అనిల్ (Video)

ఠాగూర్
ఆదివారం, 9 మార్చి 2025 (09:00 IST)
తనకు ఆ ముగ్గురి వల్ల ప్రాణహాని వుందని తనకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యత అని వైకాపా నేత, ప్రముఖ రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఆరోపిస్తూ ఓ సెల్పీ వీడియోను విడుదల చేశారు. గత నాలుగు నెలలుగా టీడీపీ కూటమి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొంటూ కంటతడి పెట్టుకుంటూ ఈ వీడియోను విడుదల చేశారు. 
 
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ల వల్ల తనకు ప్రాణహాని ఉంది, వాళ్ల నుంచి తనను కాపాడాలని ఆయన వేడుకున్నారు. తనకు ఏమైనా జరిగితే అందుకు లోకేశ్, పవన్ కళ్యాణ్‌లదే బాధ్యత అని అన్నారు. తనకు దేవుడు, జగన్,, వైకాపానే దిక్కు అని పేర్కొన్నారు. 
 
అనంతపురంలో తనకు బెయిల్ వచ్చే సమయంలో అడ్డుకునేందుకు పోలీసులు కుట్ర చేశారని ఆరోపించారు. కర్నూలులో పోలీసులు తను చిత్రహింససలు పెట్టారని వాపోయారు. తన తల్లికి అపోలో ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగిందని, ఆమెను చూసుకోవాల్సింది తానేనని చెప్పారు. 
 
తన తల్లి ఆరోగ్యం విషయంలో కోర్టు తప్పుడు ధృవపత్రాలు సమర్పించానని పోలీసులు చెబుతున్నారని, ఆ సమయంలో తాను జైల్లో ఉన్నానని, అలాంటి సమయంలో నకిలీ ధృవపత్రాలు ఎలా సృష్టిస్తానని బోరుగడ్డ ప్రశ్నించారు. తాను ఎలాంటి తప్పు  చేయలేదని, న్యాయస్థానాలంటే తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం చెన్నైలో ఉండి తన తల్లిని చూసుకుంటున్నాని, తనకు జగన్, వైకాపా తప్ప ఎవరూ లేరని వాపోయారు. తనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులు పగవాడికి కూడా రాకూడదని వీడియోలో ఆయన పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments