Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సన్నిధిలో 'దేవర' హీరోయిన్

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (16:14 IST)
Jhanvi Kapoor
దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సోమవారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనం కోసం ఆమె లంగా ఓణీలో అచ్చ తెలుగు అమ్మాయిగా తిరుమలకు వచ్చారు. 
 
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంప్రదాయబద్ధంగా లంగా ఓణీలో వచ్చిన జాన్వీ... ఈ దఫా రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. గతంలో ఆమె అలిపిరి నడక మార్గంలో కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 
Jhanvi Kapoor
 
కాగా, ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో ఓ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న "దేవర" చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో జాన్వీ కపూర్ శ్రీవారి దర్శనానికి రావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments