Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంతలు పూడ్చలేని ప్రభుత్వం.. గోతులు తీసే రాజకీయం...

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (12:20 IST)
రాష్ట్ర రహదారులపై గుంతలు పూడ్చుకోలేని ఏపీ ప్రభుత్వం, గోతులు తీసే రాజకీయం చేస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెట్రో ధరల ప్రభుత్వం వితండవాదం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంతో సమానంగా పెట్రో ధరలు పెంచిన ప్రభుత్వం, తగ్గించినప్పుడు ఎందుకు తగ్గించడం లేదని నిలదీశారు. రాజధాని నిర్మాణం పేరిట రూ. 4 సెస్ వసూలు చేస్తూ, రాజధానిని ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. అలాగే, రహదారి సెస్ పేరుతో రూ.2 వసూలు చేస్తూ, గోతులు ఎందుకు పూడ్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 
'కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు రూ. 19 వేల కోట్లే ఇచ్చిందని మీరు అంటున్నారు. అసలు కేంద్రం ఎంత ఇచ్చిందో లెక్క చెప్పండి? అంటూ ఆయన డిమాండ్ చేశారు. మాటిస్తే మడమ తిప్పనన్న జగన్ రాజధానిపై మాటెందుకు తప్పారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

రామానంద్ సాగర్ కు అంకితంగా శ్రీమద్ భాగవతం పార్ట్-1 షూటింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments