Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ - భాజపా అధ్యక్షుడు అమిత్ భేటీ

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (22:31 IST)
టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమావేశం అవుతున్నట్లు సమాచారం. అమిత్ షా రెండు రోజుల పాటు హైదరాబాదులో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమిత్ షా హోటల్ హరితలో పవన్ కల్యాణ్ తో సమావేశమవుతున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. వీరిద్దరి భేటీలో విశాఖ ఎంపీ హరిబాబు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. 
 
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో పవన్ కళ్యాణ్ మద్దతు కోసం అమిత్ ఆయనను కలుస్తున్నట్లు సమాచారం. కాగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ-బీజేపీ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ప్రచార సభలకు ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో సుడిగాలి పర్యటన చేసి ఆ రెండు పార్టీల గెలుపుకు పాటుపడిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తొలిసారిగా హైదరాబాదు పర్యటనకు వచ్చిన నేపథ్యంలో పవన్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments