Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాడులు జరుగుతున్న పట్టించుకోవడం లేదు : ఏపీ డీజీపీని మార్చండి ... ఈసీకి బీజేపీ ఫిర్యాదు

వరుణ్
శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (09:16 IST)
అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌‍సభ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రత వైఫల్యం ఉందని, రాజకీయ నేతలతో దాడులు జరుగుతున్నా రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. తక్షణం ఏపీ డీజీపీని బదిలీ చేయాలని బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించాలని ఇప్పటికే బీజేపీ నేతలు రెండు సార్లు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. 
 
ఏపీలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు రాజకీయ సేవా అధికారులుగా మారిపోయారని బీజేపీ సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్‌ల జారీలో ఎన్నికల అధికారుల నిబంధనలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఉపయోగించుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల్లో విధుల్లో ఉన్న ఉద్యోగులు, అత్యవసర సర్వీసుల్లో ఉన్న 10 లక్షల మందికి పోస్టల్ ఓట్లు ఉన్నాయని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి పోస్టల్ బ్యాలెట్ల గడవు సమయాన్ని మరింత పొడగించాలని భానుప్రకాశ్ రెడ్డి కోరారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments