Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీచ కులానికి చెందిన మోడీ దేశాన్ని పాలిస్తున్నారు.. నోరు జారిన వీర్రాజు

భారతీయ జనతా పార్టీకి చెందిన ఏపీకి చెందిన శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు నోరుజారారు. అదీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై. ప్రధాని మోడీపై ఏపీకి చెందిన టీడీపీ నేతలు చేసిన విమర్శలను తిప్పికొట్టే సమయంలో

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (09:28 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన ఏపీకి చెందిన శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు నోరుజారారు. అదీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై. ప్రధాని మోడీపై ఏపీకి చెందిన టీడీపీ నేతలు చేసిన విమర్శలను తిప్పికొట్టే సమయంలో ఆయన నోరు జారారు. 
 
విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిపై సోము వీర్రాజు స్పందిస్తూ, బీసీ వర్గానికి చెందిన ప్రధాని, నీచ కులానికి, గాండ్ల కులానికి చెందిన మోడీ దేశానికి ఎంతో చేస్తున్నారని.. ఆయనపై విశాఖలో ఫ్లెక్సీలు ఏర్పా టు చేయడం బాధాకరమన్నారు. 
 
దీనిపై టీడీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు, ఒక కులాన్ని నీచ కులమని ఎలా సంభోదిస్తారని నిలదీశారు. వీర్రాజు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ సూచించారు. మోడీది నీచకులమని కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్యానించారని, దానినే తాను గుర్తుచేశానని వీర్రాజు చెప్పారు. 
 
బీజేపీకి చెందిన ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై ఇతర బీజేపీ నేతలు సైతం ఆయనపై మండిపడుతున్నారు. ప్రత్యర్థులు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే సమయంలో జాగ్రత్తగా మాట్లాడాలంటూ హితవు పలుకుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

తర్వాతి కథనం
Show comments