Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ సీన్లోకి వచ్చిన విష్ణుకుమార్.. జగన్‌తో ప్రత్యేక భేటీ ఎందుకు?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (09:26 IST)
బీజేపీ నేత, ఏపీ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ మళ్లీ సీన్లోకి వచ్చారు. వైసీపీ అధినేత, సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విష్ణుకుమార్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జగన్ చాంబర్‌లో జరిగిన ఈ భేటీలో ప్రత్యేక హోదాపై చర్చలో మాట్లాడేందుకు సర్కారు అవకాశమిస్తుందని విపక్ష నేతకు ఆయన సూచించారు. అయితే ఇప్పటికే ఒంటి గంట దాటిపోయిందని, ఇక తనకెప్పుడు మాట్లాడే అవకాశమిస్తారని జగన్ అనుమానం వ్యక్తం చేశారు.
 
తాను అధికార పక్షంతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చిన విష్ణుకుమార్, నేరుగా అధికార పక్షం వద్దకెళ్లారు. ప్రతిపక్ష నేత వాదనను టీడీపీ నేతల ముందు పెట్టారు. వారు కూడా విష్ణుకుమార్ రాజు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని జగన్‌కు చేరవేసిన విష్ణకుమార్ రాజు పరిస్థితిని దారిలోకి తెచ్చారు. ఆ తర్వాతే సభలో సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాపై చర్చను ప్రారంభించారు. 
 
కాగా విష్ణుకుమార్ రాజు తనదైన శైలిలో రాయబారాలు నడుపుతూ కీలకంగా మారుతున్నారు. ఇప్పటికే మునుపటి అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో ఆయన అధికార పక్షాన్ని ఒప్పించిన సంగతి తెలిసిందే. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments