Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోపలేసి కుళ్లబొడిచి నట్లు బిగిస్తాం అంటూ తెలుగుదేశం నేతకు బెదిరింపులు

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (18:32 IST)
తెలుగుదేశం రాజ్యసభ ఎంపీలు పార్టీ మారిన గంటలోపే తనకు బెదిరింపులు మొదలయ్యాయని వాపోతున్నారు తెలుగుదేశం నేత ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. 'సుజనా చౌదరి ఇంటి నుంచి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ నాకు ఫోన్‌ చేసి బెదిరించారంటూ బుద్దా వెంకన్న ఆరోపిస్తున్నారు. 
 
తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలపై అనవసర వ్యాఖ్యలు చేస్తే జైల్లో పెడతారని తనను భయానికి గురి చేసేందుకు ప్రయత్నించారని అన్నారు. పార్టీ మారిన ఎంపీలపై తాను విమర్శలు చేస్తున్న నేపథ్యంలో యార్లగడ్డ తనకు ఫోన్ చేసి విమర్శలు ఆపకపోతే  జైలులో పెడతారని, నట్లు బిగిస్తారని బెదిరించారని, ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని తెలియజేశారు. 
 
ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు తనపై ఒక్క ఆరోపణ కూడా రాలేదని, అలాంటి తనను బెదిరించడం ప్రజాస్వామ్యంలో దిగజారిన చర్య అని అభిప్రాయపడ్డారు. తనకు ఫోన్లో కాల్ రికార్డు చేసే అలవాటు లేదని... లేదంటే యార్లగడ్డ బాగోతం సాక్ష్యాలతో సహా బయట పెట్టేవాడినని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments