Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణంరాజు పార్థివదేహంపై బీజేపీ జెండా.. నివాళులు అర్పించిన నేతలు

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (12:56 IST)
సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అనారోగ్యం కారణంగా ఆదివారం వేకువజామున మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. అయితే, ఆయన ఒక సినీ నటుడుగానే కాకుండా రాజకీయ నేతగా ఉన్నారు. గతంలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వంలో వివిధ శాఖలకు సహాయ మంత్రిగా పని చేశారు. ఈయన బీజేపీ నేత కూడా. దీంతో ఆయన పార్థివదేహంపై బీజేపీ పతాకాన్ని కప్పారు. 
 
ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు కలిసి జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్ళి తమ నేత భౌతిక కాయంపై బీజేపీ జెండా ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు కృష్ణంరాజు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను విష్ణువర్థన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
కాగా, కృష్ణంరాజు 1998లో కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు. ఆ మరుసటి ఏడాదే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం నుంచి బరిలో దిగి మరోసారి ఎంపీగా ఘనవిజయం అందుకున్నారు. రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన ఆయనను అప్పటి బీజేపీ హైకమాండ్ కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకుని కేంద్ర సహాయ మంత్రిగా నియమించింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments