Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణంరాజు పార్థివదేహంపై బీజేపీ జెండా.. నివాళులు అర్పించిన నేతలు

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (12:56 IST)
సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అనారోగ్యం కారణంగా ఆదివారం వేకువజామున మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. అయితే, ఆయన ఒక సినీ నటుడుగానే కాకుండా రాజకీయ నేతగా ఉన్నారు. గతంలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వంలో వివిధ శాఖలకు సహాయ మంత్రిగా పని చేశారు. ఈయన బీజేపీ నేత కూడా. దీంతో ఆయన పార్థివదేహంపై బీజేపీ పతాకాన్ని కప్పారు. 
 
ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు కలిసి జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్ళి తమ నేత భౌతిక కాయంపై బీజేపీ జెండా ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు కృష్ణంరాజు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను విష్ణువర్థన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
కాగా, కృష్ణంరాజు 1998లో కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు. ఆ మరుసటి ఏడాదే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం నుంచి బరిలో దిగి మరోసారి ఎంపీగా ఘనవిజయం అందుకున్నారు. రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన ఆయనను అప్పటి బీజేపీ హైకమాండ్ కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకుని కేంద్ర సహాయ మంత్రిగా నియమించింది. 


 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments