Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ద్రోహిగా మిగిలిపోయారు.. బీజేపీ ఫైర్

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై బీజేపీ సంచలన కామెంట్స్ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు డైరక్షన్‌లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చ

Webdunia
శనివారం, 14 జులై 2018 (10:19 IST)
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై బీజేపీ సంచలన కామెంట్స్ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు డైరక్షన్‌లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని బీజేపీ ఆరోపించింది. 
 
రాష్ట్ర విభజనను అడ్డుకోలేక ఏపీ ప్రజల దృష్టిలో కిరణ్ కుమార్ రెడ్డి ద్రోహిగా మిగిలిపోయారని భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగోతు రమేష్ విమర్శించారు. సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి, సొంత తమ్ముడిని కూడా గెలుపించుకోలేక పోయారని ఎద్దేవా చేశారు.
 
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రానికి రావాల్సిన వాటిని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలోనే ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments