ఛలో అమలాపురం.. సోము వీర్రాజు హౌస్ అరెస్టు

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (17:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. దాడులకు గురైన ఆలయాల సందర్శనకు వెళ్లిన యువకులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. 
 
పైగా, ప్రభుత్వ ఆగడాలను నిరసిస్తూ ఛలో అమలాపురం కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామన్నారు. ఛలో అమలాపురం కార్యక్రమాన్ని తాను ఇప్పటివరకు ప్రకటించనప్పటికీ... వాలంటీర్ల ద్వారా గ్రామాల్లోని బీజేపీ నేతలు, కార్యకర్తల వివరాలను ప్రభుత్వం ఎందుకు సేకరిస్తోందని ప్రశ్నించారు. 
 
ఈ నేపథ్యంలో సోము వీర్రాజును ఏపీ పోలీసులు ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. 'ఛలో అమలాపురం' కార్యక్రమానికి సోమువీర్రాజు బయల్దేరారు. ఆయనను విజయవాడలో పోలీసులు అడ్డుకున్నారు. 
 
అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నందున ముందస్తు అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఛలో అమలాపురం నిర్వహిస్తున్నట్లు సోము వీర్రాజు ప్రకటించారు. 
 
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ఐదు పార్లమెంటు నియోజక వర్గాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు ఛలో అమలాపురం కార్యక్రమంలో పాల్గొంటారని వీర్రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజును కూడా పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. అంతర్వేది సందర్శనకు వెళ్తామని ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగా నోటీసు ఇచ్చి పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments