Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ నాయకుడి ఇంట్లో పేకాట..30 మంది అరెస్టు

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:27 IST)
వైసీపీ నాయకుడి ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఎస్‌ఈబీ పోలీసులు దాడి చేసి 30 మందిని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఆదివారం ఈ  దాడి నిర్వహించారు.

తొమ్మండ్రు వీధిలోని వైసీపీ నాయకుడు సింగం భరత్‌రెడ్డి ఇంట్లో పేకాడుతున్న 30 మందిని అరెస్టు చేశామని ఎస్‌ఈబీ సీఐ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. వారి నుంచి రూ.6.23 లక్షల నగదు, మూడు కార్లు, మూడు మో టార్‌ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడిచారు.

పట్టుబడినవారిలో కడప జిల్లా ప్రొద్దుటూరు, మైదుకూరు, ఎర్రగుంట్ల పట్టణాల నుంచి వ చ్చిన వారున్నారని తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ముగ్గురు వైసీపీ నాయకులనూ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

పేకాటలో డబ్బుకు బదులుగా టోకెన్లను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారని, టోకెన్ల విలువను బట్టి గెలిచినవారికి డబ్బు చెల్లిస్తున్నారని సీఐ తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments